తమిళనాడు రాజధాని చెన్నైలోని బీసెంట్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కుమార్తె బీద మాధురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రాంగ్ రూట్లో కారు నడుపుతూ ఫుట్పాత్పై పడుకున్న సూర్య అనే యువకుడిపై కారు ఎక్కించింది. దాంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా వివరాలు సేకరించిన చెన్నై పోలీసులు బీద మాధురిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.