హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ భార్య కమలేష్ ఠాకూర్కు అసెంబ్లీ సీటు దక్కింది. డెహ్రాలో జరగనున్న ఉప ఎన్నికల్లో కమలేష్ ఠాకూర్ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ మంగళవారం ప్రకటన రిలీజ్ చేసింది. హిమాచల్ప్రదేశ్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు హమీర్పూర్, నలగ, డెహ్రాలలో జూలై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి.