పవన్ కళ్యాణ్‌పై రోజా ఘాటు వ్యాఖ్యలు

65చూసినవారు
పవన్ కళ్యాణ్‌పై రోజా ఘాటు వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'మీరు పంచె ఎగ్గాట్టాల్సింది.. గుడి మెట్లపై కాదు విజయవాడ వరద బాధితుల కోసం. మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది.. నడి రోడ్డుపై కాదు వైజాగ్ స్టీల్ కార్మికుల కోసం. మీరు గొడవపడాల్సింది.. మతాల కోసం కాదు నీట మునిగి సాయమందని పేదల కోసం. దేవుడు తమరికి బుద్ధి, జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి' అంటూ రోజా ఘాటుగా విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్