తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే రూ.4 వేల పెన్షన్ అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. "దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచుతాం. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఇస్తాం. ఐదేళ్లలో ఏటా 4 లక్షలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తాం." అని ధర్మవరం సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు.