బీసీల కోసం రూ.లక్షా 50 వేల కోట్లు: లోకేశ్

70చూసినవారు
బీసీల కోసం రూ.లక్షా 50 వేల కోట్లు: లోకేశ్
AP: ఐదేళ్లుగా బీసీలకు ఏం చేశారో జగన్‌ చెప్పాలని టీడీపీ నేత లోకేశ్‌ డిమాండ్ చేశారు. కదిరి సభలో మాట్లాడుతూ.. 26 వేలమంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. బీసీ సబ్‌ప్లాన్ నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. తాము అధికారంలోకి వస్తే.. బీసీల కోసం ప్రత్యేక రక్షణచట్టం, సబ్‌ప్లాన్‌ కింద ఐదేళ్లలో లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్