ఏపీలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2.25 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. ప్రతి మహిళ పేరు మీద రూ.5 లక్షలతో పక్కా ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో
బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. హోదా ఇచ్చేది
కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు.