పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీ నేతల పంచాయితీ తాడేపల్లికి చేరింది. మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు. ఆయనకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఇస్తే అంతా కలిసి ఓడిస్తామని స్పష్టం చేశారు. ఈక్రమంలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అంబటికి పిలుపు వచ్చింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్తోనూ సీఎం చర్చించినట్టు తెలిసింది. అంబటికి టికెట్ కేటాయింపుపై జగన్ దే తుది నిర్ణయమని తెలిసింది.