ఏపీలో ఈ నెల 18 నుంచి ఒంటి పూట బడుల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆయన పాఠశాలలకు సూచించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరుబయట తరగతులు నిర్వహించవద్దని ఆదేశించారు.