రూ.కోట్ల విలువైన బంగారం పట్టివేత

58చూసినవారు
రూ.కోట్ల విలువైన బంగారం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రూ.కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని గౌరవరం టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారులో సోదాలు నిర్వహించారు. కారులో రూ.2.10 కోట్ల విలువైన 2.94 కేజీల బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన మార్వాడీ వ్యాపారాలు అశిష్ కుమార్, కమలేష్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్