షర్మిల సంచలన వ్యాఖ్యలు

56చూసినవారు
షర్మిల సంచలన వ్యాఖ్యలు
పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. షర్మిల మాట్లాడుతూ.. ‘రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వివేకా అలాంటి వారు. ప్రజల మనిషి వివేకా లాంటి నాయకుడు ఇప్పుడు కనిపించని పరిస్థితి. ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారు. వివేకా.. గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదేళ్లయింది. ఇప్పటివరకు హత్య చేసిన వారికి శిక్ష పడలేదు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్