వరద ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది: మంత్రి నారాయణ

60చూసినవారు
వరద ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది: మంత్రి నారాయణ
విజయవాడ వరద ప్రాంతాల్లో తాజాగా మంత్రి నారాయణ పర్యటించారు. కండ్రిక ప్రాంతాల్లో ఇళ్ల క్లీనింగ్ ప్రక్రియను పరిశీలించిన మంత్రి నారాయణ అనంతరం మాట్లాడుతూ.. వరద ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడే ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఇళ్లను క్లీనింగ్ చేయడం కోసం ప్రభుత్వం ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసింది. నిన్న కొందరు మళ్ళీ వరద వస్తుంది అంటూ విషప్రచారం చేశారు. దీనిని వైసీపీ కుట్రగా భావిస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు.

సంబంధిత పోస్ట్