సీతారాం ఏచూరి గొప్ప రాజకీయ మేధావి

68చూసినవారు
సీతారాం ఏచూరి గొప్ప రాజకీయ మేధావి
ఇటీవల మరణించిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి గొప్ప రాజకీయ మేధావి అని.. సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం నెల్లూరు నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక రాజ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఎంతగానో కృషి చేశారన్నారు.

సంబంధిత పోస్ట్