జిల్లాలో 2024-2025 ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్ను పక్కాగా అమలు చేసేందుకు ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ట్రైబల్ వెల్ఫేర్ సబ్ ప్లాన్ అమలుకు శాఖలవారీగా పొందుపరచాల్సిన నివేదికపై కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.