ఎన్నికల నేపథ్యంలో భాగంగా మనుబోలు మండలంలోని బద్దెవోలు అడ్డరోడ్డు వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా సరిహద్దు చెకోపోస్టు వద్ద బుధవారం రాత్రి పలు వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన 750 ఎంయల్ 12 మద్యం సీసాలను కలిగి ఉన్నాడు. వాటిని స్వాధీనం చేసుకొని యస్ఐ అజయ్ కుమార్ కేసు నమోదు పరిచారు.