వైఎస్ జగన్ మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని, విభజన కంటే జగన్ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చూస్తామని, ఆదాయాన్ని పెంచుతామని చెప్పారు. జగన్ కంటే మంచిగా సంక్షేమాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు టీడీపీ మేనిఫెస్టోను బలంగా నమ్ముతున్నారని చెప్పారు.