శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో గురువారం రాత్రి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ సతీమణి త్రివేణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గొట్లూరు చంద్ర ను త్రివేణి కలిశారు. ఇంటింటికి తిరిగి గ్రామంలోని ప్రజలకు వచ్చే ఎలక్షన్లో సత్య కుమార్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గొట్లూరు చంద్ర ఎన్డీఏ అభ్యర్థి సత్య కుమార్ సతీమణి త్రివేణికి వాల్మీకి చిత్రపటంను అందజేశారు.