ధర్మవరం పట్టణంలోని 25వ వార్డు లోపల పార్థసారధి నగర్లో రెండో సచివాలయం నూతన భవనాన్ని టీడీపీ నాయకులు ప్రారంభించారు. బుధవారం 25వ వార్డు అధ్యక్షుడు భీమినేని ప్రసాద్ నాయుడు ధర్మవరం పట్టణ టీడీపీ అధ్యక్షుడు సుధాకర్ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితోపాటు పట్టణ, 25వ వార్డు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.