ధర్మవరం పట్టణ కేంద్రంలోని కళాజ్యోతి కూడలి నుంచి అంజుమన్ సర్కిల్ కోడలి వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారిందిని వాహనదారులు వాపోతున్నారు. వారు మాట్లాడుతూ. ప్రభుత్వ ఆసుపత్రి రెండవ ముఖద్వారం వద్ద రహదారికి ఇరువైపులా గుంతలు పడి ప్రమాదకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి రహదారిని మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.