శ్రీ సత్య సాయి జిల్లా చెన్న కొత్తపల్లి మండలంలో ముష్టికోవెల గ్రామ సమీపంలో శనివారం రాత్రి కర్ణాటక మద్యం తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మేడాపురం గ్రామానికి చెందిన రంగయ్య, సాకే నరసింహులు వద్ద 12 మద్యం బాక్స్ లు స్వాధీనం చేసుకుని రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. రంగయ్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని నరసింహలు అతని భార్య పరారి లో ఉన్నారని అన్నారు.