ధర్మవరం మండలం బిల్వంపల్లిలో ఈ నెల 15న స్రవంతి (20) అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. రెండు నెలలుగా స్రవంతి బిల్వంపల్లిలోని అమ్మమ్మ మస్తానమ్మ వద్ద ఉండి మృతి చెందగా మృతదేహాన్ని తీసుకెళ్లి మారాల గ్రామంలో ఖననం చేశామని తెలిపారు. తాజాగా గురువారం పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పంచనామ నిర్వహించారు.