బీజేపీ ఆఫీస్ వద్ద టీడీపీ ధర్నా మంత్రి రావాలని నినాదాలు

65చూసినవారు
ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున నియామకం బీజేపీ-టీడీపీ మధ్య చిచ్చు పెట్టింది. వైసీపీ కి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలున్న ఆయనను మళ్లీ నియమించారని టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఆయనకు అనుకూలంగా మంత్రి సత్య కుమార్ మాట్లాడటంతో బీజేపీ ఆఫీస్ వద్ద శనివారం ధర్నా చేశారు. మంత్రి బయటకు రావాలని నినాదాలు చేశారు. మల్లికార్జున విధులకు హాజరైతే బయటకు ఈడ్చేస్తానని పరిటాల శ్రీరామ్ గతంలో హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్