బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు పోరాటాలు సాగించిన రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతిసాహు మహారాజ్ అని వక్తలు పేర్కొన్నారు. బుధవారం హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం శాఖ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సాహు మహారాజ్ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.