గురు పౌర్ణమి వేడుకలలో భాగంగా భిక్షాటన కార్యక్రమం

561చూసినవారు
కదిరి పట్టణంలోని వాణి వీధిలో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ మట్ట చిన్నరాయన శెట్టి ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. ఈనెల 21వ తేదీన ఆదివారం జరగనున్న గురు పౌర్ణమి వేడుకలో భాగంగా శనివారం భిక్షాటన చేసినట్లు ఛైర్మన్ తెలిపారు. ఆలయంలో భక్తులకు పెద్ద స్థాయిలో అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్