కదులుతున్న ప్రైవేట్ బస్సులో మంటలు

2573చూసినవారు
కదిరి నుంచి బెంగళూరుకి ప్రయాణికులతో వెళుతున్న ఎస్ ఎల్ ఎన్ బస్సులో శనివారం మంటలు చెలరేగాయి. బీ కొత్తకోట సమీపంలోని వర్రోల్లపల్లి చెక్ పోస్టు వద్దకు చేరుకోగానే ఈ ఘటన జరిగింది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ప్రయాణికులతో పాటు స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్