కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) తిమ్మప్ప శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. తిమ్మప్ప కళ్యాణదుర్గం, రాయదుర్గం వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పని చేశారు. ప్రతి ఒక్కరితోనూ కలియువిడిగా, సౌమ్యుడిగా మెలిగారన్నారు. తిమ్మప్ప మృతి పట్ల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సిబ్బంది సంతాపం ప్రకటించారు.