శ్రీసత్య సాయి జిల్లా మడకశిర ఆగాలి మండలం బ్యాడగారా పలు గ్రామాల్లో ఆదివారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి సాగనంపాలన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.