పెనుకొండలో గృహాలను ప్రారంభించిన ఎంపీ

71చూసినవారు
పెనుకొండలో గృహాలను ప్రారంభించిన ఎంపీ
పెనుకొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ సమీపంలో ఉన్న కాలనీలో నిర్మించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, అర్బన్ 2. 0 గృహాలను హిందూపురం ఎంపీ బి. కె. పార్థసారథి మంగళవారం ప్రారంభించారు. అధికారులతో కాలనీలో ఇళ్ల నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ శివశంకరప్ప, గృహ నిర్మాణ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్