రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టిన ఎస్ఐ

50చూసినవారు
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టిన ఎస్ఐ
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం వెలగమాకలపల్లి క్రాస్ దగ్గర శనివారం ఉన్నతాధికారుల సూచనల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు ప్రక్కన గల కరెంట్ ఫోళ్ళకి రేడియం స్టిక్కర్లను ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది అంటించారు. ఈ సందర్బంగా స్టాప్ అనే సిగ్నల్ రాస్తూ ఇక్కడ ఉన్న రోడ్డుకి ఇరువైపులా అడ్డముగా ఉన్న కంప చెట్లను తొలగించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్