ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నీటి కొరత

63చూసినవారు
పుట్టపర్తి పరిధిలోని ప్రభుత్వఉన్నత పాఠశాలలో విద్యార్థులు నీళ్లు లేక అస్త వ్యవస్థలు పడుతున్నారు. 330మంది ఉన్న ఈ పాఠశాలలో బాలికలు మరుగుదొడ్లకు వెళ్లడానికి సైతం నీళ్లు లేవు. ఇక్కడ ఉన్న బోరుమోటర్లు, కుళాయిలను గతంలో 3సార్లు దొంగలు ఎత్తుకెళ్లారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితంలేదని తెలిపారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తాగడానికి, వాడుకోవడానికి నీటివసతి కల్పించాలని విద్యార్థులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్