ఉమ్మడి జిల్లాలో 35, 800 భూసార పరీక్షల నిర్వహణ

50చూసినవారు
ఉమ్మడి జిల్లాలో 35, 800 భూసార పరీక్షల నిర్వహణ
ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 35, 800 భూసార పరీక్షలు నిర్వహించినట్లు అనంతపురం భూసార పరీక్షా కేంద్రం ఏడీఏ రోజా పుష్పలత ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. అనంతపురం జిల్లాకు సంబంధించి 18, 600, సత్యసాయి జిల్లాలో 17, 200 పరీక్షలు నిర్వహించారన్నారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా వ్యవసాయ అధికారులు రైతులకు సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని, సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్