రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్వామి వారు గజేంద్ర వాహనోత్సవంపై పురవీధుల్లో ఊరేగారు. ఆర్యవైశ్య, వీరశైవ లింగాయత్, బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆలయం నుండి భక్తిశ్రద్ధలతో పెద్ద ఎత్తున ఊరేగింపు ర్యాలీ నిర్వహించారు. చిన్నారుల కోలాట ప్రదర్శన, నంది కోళ్ల ప్రదర్శన, బ్రాహ్మణ మహిళల నృత్యాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.