రాయదుర్గం: 11 కే విద్యుత్ వైర్ తెగి మంటలు

53చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని నేతాజీ రోడ్డులో గత అర్ధరాత్రి 11 కే విద్యుత్ వైర్ తెగి మంటలు వ్యాపించాయి. దీంతో తక్షణమే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేసి మంటలను ఆర్పి వేశారు. గంటసేపట్లోనే విద్యుత్ శాఖ ఏఈ బాలచంద్ర ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు పూర్తిచేసి కరెంటు సరఫరా అయ్యేలా కృషి చేశారు. ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్