యాడికి మండలం కోన ఉప్పలపాడు లో ఇరువర్గాల వారు రాళ్ల దాడికి పాల్పడ్డ కేసులో 24 మందిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసే విషయంలో వైకాపా టిడిపి ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగ అది కాస్త గొడవకు దారి తీయడంతో కర్రలతో కొట్టుకున్నారు. ఈ కేసు సంబంధించి పోలీసులు మొత్తం 26 మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సిఐ నాగార్జున్ రెడ్డి తెలిపారు.