తాడిపత్రి అభివృద్ధికి సహకరించండి

79చూసినవారు
తాడిపత్రి పట్టణ అభివృద్ధికి వ్యాపారులు, సేవా సంస్థ లు, ప్రజలు ఇలా అందరూ సహాయ సహకారాలు అందించాలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం పట్టణ అభివృద్ధిపై సమావేశం జరిగింది. జేసీపీఆర్ పాల్గొని మాట్లాడుతూ ఎక్కడబడితే అక్కడ వెంచర్లు ఏర్పాటు చేస్తే డ్రైనేజీనీరు ఎక్కడికి వెళుతుందని ప్రశ్నించారు. గతంలో ఏమి జరిగిందో సంబంధం లేదని, ప్రస్తుతం అభివృద్దికి ఏమి చేయాలో ఎలా చేయాలో ప్రతి ఒక్కరూ సలహాలు, సూచనలు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్