ఉరవకొండ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం హోం ఫర్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకున్న 85 సంవత్సరాలు నిండిన వృద్ధులతో పాటు దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన కల్పించింది. మొదటి రోజు ఉరవకొండ మండల పరిధిలోని 21 మంది ఓటర్లు బ్యాలెట్ పేపర్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 72 మంది అప్లై చేసుకున్నారు.