ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుభాకాంక్షలు తెలిపారు. ముహమ్మద్ ప్రవక్త చూపిన మార్గం అనుసరించేందుకు ప్రతి ఒక్కరు ఆ మార్గంలో నడవాలని సూచించారు.ఈ పర్వదినాన్నిముస్లిం సోదరులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని,అల్లా అనుగ్రహం ఎల్లవేళలా అందరిపై ఉండి, సుఖశాంతులతో జీవితం నిండాలని ఆకాంక్షించారు.