దేవాలయాలకు సంబంధించిన రథాల భద్రతపై పోలీసుల నిఘా

83చూసినవారు
దేవాలయాలకు సంబంధించిన రథాల భద్రతపై ప్రత్యేక నిఘాను కొనసాగిస్తామని సీఐ సురేష్ బాబు పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండ పట్టణంలోని గవిమఠం, మల్లేశ్వర ఆలయం, పార్కు ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన రథాలను సందర్శించారు. అక్కడ ఉన్న భద్రత చర్యలను పరిశీలించారు. సంబంధిత ఆలయ అధికారులు రథాల ఉన్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, కాపలా వ్యక్తులను ఏర్పాటు చేసుకోవాలనిసూచించారు.

సంబంధిత పోస్ట్