ఉరవకొండ: గజలక్ష్మి అలంకరణలో అమ్మవారు

67చూసినవారు
ఉరవకొండ: గజలక్ష్మి అలంకరణలో అమ్మవారు
ఉరవకొండ మండలం పెన్నాహోబిళంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో వెలిసిన ఉద్భవ లక్ష్మీదేవి ఆలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా మంగళవారం అమ్మవారు గజలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాత సేవలో భాగంగా అమ్మవారికి అభిషేకం, ఆభరణాలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్