వ్యవసాయ భూములకు సాగునీరు అందక పంట ఎండిపోతుంది

74చూసినవారు
వ్యవసాయ భూములకు సాగునీరు అందక పంట ఎండిపోతుంది
పొందూరు మండలం గండ్రేడు, తాడివలస, లత్సయ్య పేట లో వ్యవసాయ భూములకు సాగునీరు అందక పంట ఎండిపోతుందని స్థానిక రైతులు బుధవారం తెలిపారు. ఆగస్టు మూడో వారం గడుస్తున్న నారాయణపురం కుడి కాలువ నుంచి సాగునీరు అందడం లేదని వాపోయారు. ఇదే పరిస్థితి ఆముదాలవలస మండలం బెలమాo, లొద్దల పేట తదితర గ్రామాల్లో నెలకొందని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని కోరారు

సంబంధిత పోస్ట్