ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం సందర్బంగా ఎచ్చెర్ల బుడుమూరు ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు బుధవారం జరిగాయి. సర్ సివి రామన్ చిత్రపటానికి పూలదండ వేసి ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు ఎస్. కె. ప్రసాదరావు, జీవశాస్త్ర ఉపాధ్యాయులు పూజారి గోవిందరావు, ఫిజిక్స్ ఉపాధ్యాయిని మంత్రాల అనురాధ, గణిత ఉపాధ్యాయులు రమేష్ బాబు నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైంటిఫిక్ గా ఆలోచించాలని కోరారు.