ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం

78చూసినవారు
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా శనివారం లావేరు మండలంలోని కూనపువానిపేట, భీమునిపాలెం, బుడుమూరు తదితర గ్రామంలో రక్షిత మంచినీటి పథకాలను వారు ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్