ముంబయిలో జిల్లా వాసి మృతి

6015చూసినవారు
ముంబయిలో జిల్లా వాసి మృతి
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేదారిపురానికి చెందిన నీలపు గణేష్ (27) ముంబయిలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్తున్నట్లు గత నెల 16న ఇంటి వద్ద చెప్పి వెళ్లాడు. ఆదివారం రాత్రి అతను ముంబయిలో మృతి చెందారని రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు సోమవారం ఫోన్ చేసి చెప్పగా కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడికి తల్లి తరుణమ్మ, సోదరుడు దుర్యోధన, సోదరి లావణ్య ఉన్నారు.

సంబంధిత పోస్ట్