గంజాయిని తరలిస్తున్న ముఠా సభ్యుల అరెస్టు

64చూసినవారు
ఒడిశాకు చెందిన ముగ్గురు 32. 470 కిలోల గంజాయి మూటలతో పోలీసులకు చిక్కారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా క్రైమ్ అదనపు ఎస్పీ పి. శ్రీనివాసరావు ఆదివారం ఇచ్చాపురం సర్కిల్ పోలీసు కార్యాలయంలో వెల్లడించారు. ఒడిశాలోని గజపతి జిల్లా కొత్తుమ గ్రామంలో ఉంటున్న రేష్మానాయక్, రైజుకా గ్రామానికి చెందిన గజేంద్ర నాయక్, కరియాగుడ గ్రామానికి చెందిన సుమతి నాయక్ లను ఇచ్ఛాపురం రైలు నిలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్