పాలనను చూసి ఓటు వేయాలి

65చూసినవారు
పాలనను చూసి ఓటు వేయాలి
వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనను చూసి రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి అన్నారు. ఇచ్ఛాపురం పట్టణంలోని 17 వార్డు లాలాపేటలో సోమవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. మున్సిపల్ పాలక సంఘం సభ్యులంతా ఇంటింటికీ వెళ్లి సీఎం జగన్ హయాంలో మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని వివరించి ఓట్లను అభ్యర్థించారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతిదివ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్