ఇచ్చాపురంలో 5కేజీల గంజాయితో వ్యక్తి అరెస్ట్

64చూసినవారు
ఇచ్చాపురంలో 5కేజీల గంజాయితో వ్యక్తి అరెస్ట్
గోపాల్ సింగ్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. మంగళవారం ఇచ్చాపురం పట్టణంలో 5. 310 కేజీల గంజాయితో పట్టుకున్నట్లు ఇచ్చాపురంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. బీకాం వరకు చదువుకున్న గోపాల్ సింగ్ వ్యసనాల బారిన పడి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. అతడి వద్ద నుంచి ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.

సంబంధిత పోస్ట్