నైర పంచాయితీలో సర్పంచ్ అరవల రామప్రతాప్, అరవల రవీంద్ర ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ప్రజాగళం కార్యక్రమంలో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనకు మించిన నియంతృత్వ, దుర్మార్గపు పాలనతో జగన్మోహనరెడ్డి చరిత్ర పుటల్లో నిలిచిపోతారని ద్వజమెత్తారు. ప్రజలు, యువత జీవితాలను నాశనం చేసి, భవిష్యత్తును ప్రశ్నర్ధకంలో పెట్టిన ఘనత జగన్ దేనన్నారు.