ఎస్ఈబీ తనిఖీల్లో నాటు సారా, బెల్లం ఊట ధ్వంసం

71చూసినవారు
ఎస్ఈబీ తనిఖీల్లో నాటు సారా, బెల్లం ఊట ధ్వంసం
శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలంలోని సీఐ, ఎస్ఐలు ఆధ్వర్యంలో ఆంధ్ర-ఒడిస్సా సరిహద్దు ఏజెన్సీ గ్రామాలలో ఎక్సైజ్ అధికారులు మరియు ఒరిస్సా పోలీసులు సంయుక్తకంగా ముమ్మర తనిఖీలను మంగళవారం నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 17 వేల లీటర్ల పులిసిన బెల్లం ఊట అలాగే 370 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేసినట్లు ఎస్ఈబీ ఉన్నత అధికారులు టి. తిరుపతి నాయుడు తెలిపారు. ఈ దాడుల్లో సీఏ బేగం తదితర పోలిస్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్