రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఇచ్ఛాపురం శాసనసభ్యులు బెందాళం అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శనివారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో శనివారం రాత్రి కలుసుకున్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. తన నియోజకవర్గంలో పేరుకుపోయిన కొన్ని అభివృద్ధి పనులపై ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా బహుదా నది వంతెన పనుల పరిస్థితిపై సమీక్షించారు.