గ్రంథాలయాన్ని పాఠకులు సద్వినియోగం చేసుకోవాలి

65చూసినవారు
గ్రంథాలయాన్ని పాఠకులు సద్వినియోగం చేసుకోవాలి
నందిగాం మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో చదవడం-మాకిష్టం కార్యక్రమాన్ని ఆదివారం గ్రంథాలయ అధికారి ఎస్. ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పిల్లల చేత పలు కథలు, పద్యాలు చదివించారు. ఆ తరువాత విద్యార్థులతో డిబేట్ నిర్వహించారు. ప్రతి ఆదివారం చదవడం - మాకిష్టం, ప్రతి నెలా మొదటి ఆదివారం పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠకులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్