తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రముఖ తమిళ సినిమా స్టార్ హీరో రజినీకాంత్ కూతుర్లు దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రజనీకాంత్ కూతుర్లు ఐశ్వర్య, సౌందర్యలు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిని ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. రజనీకాంత్ అభిమానులు వారితో ఫోటోలు దిగారు.